బ్యాంకు దోపిడీ యత్నించిన కేసులో నిందితుడి మీద అభియోగాలు రుజువు కావడంతో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తు మొదటి అదనపు జడ్జి కనుక దుర్గ తీర్పు చెప్పారు .ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 2024జనవరి 1 రాత్రి11 గంటలకు సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బ్యాంక్ బ్యాంకు షటర్ ధ్వంసం చేసి బ్యాంకులో ప్రవేశించారు కానీ సీసీ కెమెరాల నుంచి నోటిఫికేషన్ అందుకున్న బ్యాంకు మానేజర్ బనోత్ రాజు అప్రమత్తం అయ్యారు.
బ్యాంకు లో ఓ వ్యక్తి చొరబడి నట్లుగా తన ఫోన్ లో ఉన్న సీసీ కెమెరా ల లింక్ దృశ్యాలు చూపెట్టాడు. దీనితో గ్రామస్థులతో కలిసి వెంటనే బ్యాంకు కి వెళ్లి న మేనెజర్ బ్యాంకు లో చొరబడిన ఆలూరి సంతోష్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు ధర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నిందితుడి మీద అభియోగాలు నమోదు చేశారు ఈ కేసు ను మొదటి అదనపు జిల్లా కోర్టు లో విచారణకు వచ్చింది.
నిందితుడు సంతోష్ దోపిడి యత్నం,ప్రాపర్టీ డ్యామేజ్ నేరాల చేసినట్లుగా రుజువు అయింది. దీనితో అతనికి 7 సంవత్సరాల జైలు శిక్షను మూడు వేల రూపాయల జరిమానా విధిస్తు తీర్పు ఖరారు చేసారు.
