ఎయిమ్స్ లో మృతి చెందిన మన్మోహన్ సింగ్ భౌతికాయాన్ని సందర్శనార్థం ఢిల్లీలోని ఆయన నివాసానికి తరలించారు.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న మన్మోహన్ సింగ్ కుమార్తె ఇండియాకు బయలు దేరారు ఆమె శుక్రవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది.
శనివారం అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఈపాటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.
