Monday, April 20, 2026
HomeCRIMEఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.నలుగురు మావోయిస్టులు మృతి.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.నలుగురు మావోయిస్టులు మృతి.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని కొర్చోలి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో నక్సల్స్ గాయపడినట్లు సమాచారం.. పలువురికి గాయాలు అయినట్లు సమాచారం.

ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.అయితే,అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు, మావో యిస్టులు తారస పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, మావో యిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

మరణించిన మావోయిస్టు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలం వద్ద మందు పాతరలు,ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!