మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ఉన్న రెవెన్యూ శాఖలో భారీగా శాఖలోని భూ అక్రమాలు జరిగాయని బిఆర్ యస్ నేత ఆర్ యస్ ప్రవీణ్ ఆరోపించారు ఆయన మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియా తో మాట్లాడారు.
భూ భారతి పోర్టల్లో అక్రమంగా 22 వేల బదలాయింపు లు జరిగాయని 22 వేల మందికి చెందిన భూములు వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్లకు తెలియకుండా వేరే వాళ్లకు బదలాయించారని ఆయన ఆరోపించారు
సాఫ్ట్వేర్లో మార్పులు జరిపి ఈ భూములకు చెందిన వారికి సంబంధం లేకుండా తమకు ఇష్టమైన వారి పేర్ల మీదకు బదలాయించారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల మాన ప్రాణాలకు ఎలాగూ రక్షణ లేదు..
ఇప్పుడు భూములకు కూడా రక్షణ లేని పరిస్థితికి వచ్చిందన్నారు. ఈ భూముల విలువ దాదాపు పది వేలకోట్లన్నారు ఈ వ్యవహారంలో మంత్రి ప్రమేయం లేక పొతే ఉన్నపలంగా సిబిఐ విచారణ కోరలన్నారు
