నిలోఫర్ ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థుల పై రోగి సహాయకులు చేసిన దాడికి నిరసనగా వైద్య విద్యార్థులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు.
ఈ మేరకు సోమవారం నిలోఫర్ ఆసుపత్రిలో సూపరిండెంటు ఛాంబర్ ముందు పీజీ వైద్య విద్యార్థులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో పీజీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
