పోలీస్ అమరవీరుల సంస్మరణ దినముల సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు డి.సి.పి కోటేశ్వర రావు మాట్లాడుతూ సిబ్బందిచేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానం అవుతుందని, తలసేమియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని తెలిపారు.
అలాగే ప్రతీ ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవవలలో పాల్గొని తోటి వారి ప్రాణాలను కాపాడటములో తమ వంతు సహయముగా రక్తదానం చేయడం అనేది ఒక సామాజిక కార్యక్రమం అని, ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు.
ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 49 మంది పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారు.
