HomeCRIMEఅటవీ మార్గంలో ఐదు చిరుతల సంచారం

అటవీ మార్గంలో ఐదు చిరుతల సంచారం

మాక్లూర్‌ మండలం గాలిబ్‌నగర్‌ నుంచి కల్లెడకు వెళ్లే అటవీ ప్రాంతంలో ఐదు చిరుతలు రోడ్డుపైకి వచ్చి సంచరించాయి. రాత్రివేళ అటువైపు వెళ్తున్న ప్రయాణికులు చిరుతలను గమనించి అక్కడే వాహనాలను నిలిపివేశారు. కొద్దిసేపు రోడ్డుపైనే సంచరించిన చిరుతలు అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి.

ఈ ప్రాంతంలో చిరుతల సంచారం కనిపించడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ గాలిబ్‌నగర్‌–కల్లెడ అటవీ మార్గంలో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతల సంచారంపై నిఘా పెట్టాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments