భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణలోని మెదక్ కామారెడ్డి జిల్లాలు అతలాకుతులం ఆవుతున్నాయి.
జాతీయ రహదారి సైతం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది గంటల తరబడిగా రాకపోకలు స్తంభించిపోయాయి
హైదరాబాద్ నుంచి నిజామాబాద్, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు బంద్ అయ్యాయి మెదక్ జిల్లా నార్సింగి వద్ద హైవేపై నే వరద నీరు భారీగా చేరింది ఆ ప్రాంతం చెరువును తలపించింది.
వాహనాలు వరదలో కొట్టుకుపోయే అవకాశం ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు ఇరు వైపుల వాహనాలను నిలిపివేసారు.
