కామారెడ్డి జిల్లా పల్వంచ మండలంలో తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మండలంలోని వాడి గ్రామానికి చెందిన జస్వంత్ (15) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల వివరాల ప్రకారం.. జస్వంత్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే బాలుడు ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి గల కారణాలు తెలియరాలేదు.
