నిజమాబాద్ నగరంలో ముసుగు దొంగలు హల్చల్ సృష్టించారు. నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగస్థాన్ ఫేజ్-1లో ఓ అపార్ట్మెంట్లో శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు దొంగలు ముసుగు ధరించి ప్రవేశించారు. అపార్ట్మెంట్లోని పై అంతస్తులో సంచరించారు.
దొంగలు తిరుగుతున్న వీడియో అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.దేనిపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి దొంగతన జరగలేదని తెలిపారు.అలాగే శుక్రవారం మూడవ టౌన్ పరిధిలో వీరే చోరికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు దుండగుల కోరకు సీసీ కెమెరాల ద్వారా విచారణ చేస్తున్నారని తెలిపారు.
