ప్రమాదవశాత్తు ఒంటికి నిపంటుకొని వృద్దురాలు మృతి చెందిన ఘటన మోర్తాడ్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..మండలంలోని ఎస్సీ వాడ కు చెందిన ముతమ్మ(68).ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుంది.దీంతో ఒక్క సారిగా మంటలు రేగడంతో బయటకు వెళ్లినట్టు తెలిపారు.
స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
