పిల్లలకు చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నేడు బసవ గార్డెన్లోని ఆమెచూర్ టైక్వాండో స్టూడియో ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి సీపీ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పిల్లలకు మంచి బలమైన ఆహారంతో బాగా ప్రాక్టీస్ చేయగలరని అన్నారు.
పిల్లలు టైక్వాండో లాంటి క్రీడలు నేర్చుకోవడం ద్వారా మానసికంగా శారీకంగా మంచిగా ఉంటారని, మంచిగా చదువుతారన్నారు.
టైక్వాండో కార్యదర్శి మనోజ్ కుమార్ అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన టైక్వాండో చైర్మన్ బసవ లక్ష్మీ నరసయ్య ప్రెసిడెంట్ బాజిరెడ్డి జగన్ వైస్ ప్రెసిడెంట్ జి రవీంద్ర గుప్తా డాక్టర్ విశాల్ డాక్టర్ ప్రతిమరాజ్ తల్లిదండ్రులు బ్లాక వెల్డర్స్ గంగాధర్ నాగరాజ్ సిద్ధార్థ రిత్విక తదితరులు పాల్గొన్నారు.