నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ సీఎస్ఐ చర్చ్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించినట్లు సీఐ తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో 20 మంది పై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్నారు. ఎలాంటి ఆధారాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
వాహనదారులు తప్పనిసరిగా దృవికరనపత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. లేని వారికి జరిమానా విధించామని పేర్కొన్నారు. తనిఖీల్లో నిజామాబాద్ సీఐవెంకట నారాయణ,ఎస్సై సుమన్ లతో పాటు పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
