HomePOLITICAL NEWSUncategorizedఉప రాష్ట్ర పతి అభ్యర్థిగా రాధాకృష్ణన్

ఉప రాష్ట్ర పతి అభ్యర్థిగా రాధాకృష్ణన్

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను ఖరారు చేసారు. ఆదివారం రాత్రి బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం అయింది ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‎ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. .

ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్, పార్లమెంటరీ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని అభ్యర్థి ఎంపికపై చర్చించారు.

అనంతరం ఎన్డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‎గా పని చేస్తోన్న సీపీ రాధాకృష్ణన్ పేరును ఖరారు చేశారు . అనంతరం ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. 

ఆయన తమిళనాడు లోని కోయంబత్తూరు ఎంపీ గా రెండు పర్యాయాలు పనిచేసారు సీపీ రాధాకృష్ణన్ . గతంలో తెలంగాణ, జార్ఖండ్ గవర్నర్‎గా కూడా పని చేశారు. సీపీ రాధాకృష్ణన్‎ స్వస్థలం తమిళనాడు.

2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు, సౌత్‎లో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ సీపీ రాధాకృష్ణన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments