నిజాంసాగర్ ప్రాజెక్టు వరద నీటి ప్రవాహం అనూహ్యంగా పెరగడంతో గేట్లు ఎత్తారు. ఆదివారం అర్ద రాత్రి ఒంటి గంట ప్రాంతంలో జుక్కల్ ఎమ్మెల్యే కెప్టేన్ లక్ష్మి కాంత రావు చేతుల మీదుగా ఓకే గేట్ ఎత్తారు.
అంతకు ముందు జోరువాన లోనే ప్రాజెక్టు వద్ద గంగమ్మ పూజ లు చేశారు. కానీ కానీ ఎగవ నుంచి వరద నీరి భారీగా వస్తుండడంతో సోమవారం ఉదయం మరో ఏడు వరద గేట్ల ద్వారా మంజీరా నది లోకి నీటిని విడుదల చేసారు.
ప్రాజెక్టు పూర్తీ స్థాయి నీటిమట్టం కు చేరువ కావడంతో అప్రమత్తం అయినా అధికారులు దిగువన నది ప్రవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసారు.
