శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోకి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో నీటిమట్టం పెరుగుతుంది.సోమవారం ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి విడిచి పెట్టనున్నారు .
ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయొద్దని ప్రాజెక్టు అధికారులు దండోరా వేయిస్తున్నారు
