ఎన్ కౌంటర్ లో రియాజ్ హతం అయ్యాడని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేసారు. సోమవారం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఉదయం బాత్రూం కోసం వెళ్లి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
అతడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసుల నుంచి బలవంతంగా తుపాకీ లాక్కొని రియాజ్ కాల్పులకు యత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ చనిపోయాడు’ అని డీజీపీ వెల్లడించారు….
@@@@ ఆసుపత్రి ఎదుట సంబరాలు @@@
కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేసిన రియాజ్ ఎన్ కౌంటర్ హతం కావడంతో హిందూ వాహిని యువకులు ఆసుపత్రి ఎదుటే సంబరాలు చేసుకున్నారు పటాకులు కాల్చి పోలీసులకు అనుకూలంగా నినాదాలు చేసారు
