పాల్వంచ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంద సమరసింహారెడ్డి వరుసగా రెండోసారి నియమితులయ్యారు. ఆయన పనితీరును గుర్తించిన పార్టీ అధిష్టానం మరోసారి ఈ బాధ్యతలను అప్పగించింది.
తనపై నమ్మకముంచి ద్వితీయ విఘ్నం లేకుండా పదవిని కేటాయించినందుకు రాష్ట్ర మంత్రి మహమ్మద్ అలీ షబీర్, నాయకులు ఇలియాస్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చిట్టెపు మధుసూదన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్లకు సమరసింహారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
సమరసింహారెడ్డి నియామకం పట్ల మండలంలోని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. యువతను ఏకం చేస్తూ పార్టీ బలోపేతానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కార్యకర్తలు కొనియాడారు.
ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ కమిటీ సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు అధిష్టానానికి, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మండలంలో పార్టీ విజయానికి సమరసింహారెడ్డి నాయకత్వంలో శక్తివంచన లేకుండా పనిచేస్తామని వారు పేర్కొన్నారు.
