తమ డిమాండ్ ల సాధనకోసం సెక్రటేరియట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మంగళవారం తెలంగాణ సచివాలయం లోని ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సచివాలయ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.
తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులంతా కలిసి బాహుబలి ద్వారం ఎదుట నిరసనకు దిగారు.
