జాతీయ యువజన ఉత్సవాల తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా ఉమ్మడి జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ నియమితులయ్యారు.
ఈ మేరకు ఆమె కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, కె .రామ్మోహన్ నాయుడుతో విడివిడిగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం యువత కోసం ఇస్తున్న పథకాల గురించి, భవిష్యత్తులో యువత కోసం చేయబోతున్న కార్యక్రమాల గురించి వివరించినట్లు శైలి బెల్లాల్ తెలిపారు.
