నిబంధనకు విరుద్ధంగా రాత్రి 10:30 గంటల తర్వాత తెరిచిన దుకాణం యజమానికి జిల్లా కోర్టు ఒక్కరోజు జైలు శిక్ష విధించినట్లు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి తెలిపారు.
నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో ఎండి రిజ్వాన్ తన పాన్ షాప్ ను రాత్రి 10:30 గంటలు దాటిన నడిపించడంతో పట్టుకొని గురువారం జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా ఒక్కరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… వన్ టౌన్ పరిధిలోని ఎవరైనా షాప్, హోటల్ యజమాని నిబంధనలు ఉల్లంగించి, సమయానికి మించి షాప్/హోటల్ తెరిచి ఉంచినట్లయితే వారిపై తగిన చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
