Thursday, April 16, 2026
HomeTelanganaNizamabadచదువుతో పాటు క్రీడలు అవసరం...ఒలంపిక్ రన్ ప్రారంభించిన సీపీ సాయి చైతన్య..

చదువుతో పాటు క్రీడలు అవసరం…ఒలంపిక్ రన్ ప్రారంభించిన సీపీ సాయి చైతన్య..

విద్యార్థులకు చదువుతోపాటు, క్రీడలు చాలా అవసరమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.అలాగే ప్రతి విద్యార్థి ఏదైనా ఒక క్రీడను ఎంచుకొని అందులో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా జాతీయ జెండాను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించాలని ఆకాంక్షించారు.

శుక్రవారం రాష్ట్ర ఒలంపిక్ సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని ఆర్.ఆర్ చౌరస్తా నుండి ఒలంపిక్ రన్ జిల్లా ఒలంపిక్ టార్చ్ , జెండాను ఊపి ఒలంపిక్ రన్ ను ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఒలంపిక్ ప్రపంచ దేశాలన్నీ ఈ క్రీడల్లో పాల్గొంటారని ప్రతి క్రీడాకారుని కల ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనడం ఆశయమని అన్నారు. ఒలంపిక్ డే సందర్భంగా జిల్లా ఒలంపిక్ సంఘం నిర్వహించిన ఒలంపిక్ రన్ క్రీడాకారులు విద్యార్థులు పాల్గొనడం హర్షణీయమని అన్నారు.

ఈ సందర్భంగా ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది విధులను నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఒలింపిక్ సంఘం సభ్యులు, నిజామాబాద్ నగర ఏసిపి రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!