కోటగిరి మండల ప్రజా పరిషత్ ఇన్చార్జ్ ఎంపీడీవో కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు. గత రెండు నెలల క్రితం ఎంపిఓ చందర్ ఎంపీడీవో బాధ్యతలు నిర్వహిస్తుండగా , అతని నుండి చార్జ్ తీసుకొని బాధ్యతలను చేపట్టారు.
అనంతరం ఆయనకు కార్యాలయ సిబ్బంది పూల బొకే ఇస్తూ శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మండల ప్రజా పరిషత్ జూనియర్ అసిస్టెంట్ విట్టల్,ఏపీఓ గంగారం కోటగిరీ ఈవో ముజాఫర్ బేగ్,ఎన్ఆర్జిఎస్,ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
