నిజామాబాద్ నగరంలోని ప్రగతి హాస్పిటల్ సమీపంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వివాదం కత్తిపోట్లకు దారితీసినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
