నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛతా హి సేవ అవగాహన ర్యాలీ నీ నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి పారిశుధ్య వాహనాలతో పులాంగ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ మకరంద్ మాట్లాడుతూ.
నగరంలోని అన్ని డివిజన్ ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ లు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
