ఒక రైతు నుంచి లంచం తీసుకుంటుండగా తహశీల్ధార్ ను ఏసీబీ రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది.తన భూమికి సంబంధించిన నాలా కన్వర్షన్ కోసం తహశీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నాడు .
ఆ పని చేసి పెట్టడానికి తహశీల్దార్ దిలీప్ నాయక్ సదరు రైతును 70 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ రైతు… అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు.
రైతు నుంచి తహశీల్దార్ దిలీప్ నాయక్ 70 వేల రూపాయల నగదు తీసుకుంటుండగా… ముందస్తు ప్లాన్ ప్రకారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. లంచం డబ్బులతో తహశీల్దార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
