నిజామాబాద్ నగరంలోని నాందేడ్ వాడ చెందిన భిమ్రావ్ అనే వ్యక్తి పై సొంత అన్న కత్తెర తో దాడి చేసిన ఘటన 2023 జరిగింది.భార్య దుప్తల వరలక్ష్మి ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చెయ్యగా కేసు పోలీసులు కేసు నమోదు చేశారు.
బిమ్రావ్ అన్న హనుమంతు జులాయిగా తిరుగుతూ రోజు వారి ఖర్చుల కోసం భీమ్ రావ్ నీ అతని కుటుంబాన్ని డబ్బుల కోసం వేధించే వాడు.
పలుమార్లు డబ్బులు ఇచ్చినప్పటికీ 15/11/23 రోజు ఉదయం అందజ 8:30 ప్రాంతంలో తమ్ముడి ఇంటికి విచ్చిన హనుమంతు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చెయ్యగా లేవు అని చెప్పిన తమ్ముడు భీమ్ రావ్ పై అక్కడే వున్న కత్తెర తో దాడికి దిగాడు ఇది గమనించిన భార్య పిల్లలు అరిచి కేకలు పెట్టడంతో ఇంటి యజమాని వచ్చే లోగా అన్న హనుమంతు అదే కత్తెర తనను తను పొడుచుకొని గాయపరుచుకోవడం జరిగింది.
ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించి ఈ రోజు అదనపు సబ్ కోర్ట్ జడ్జ్ ఏం.శ్రీకాంత్ బాబు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 1000 రూపాయల జరిమానా విధించారు.కేస్ పురోగతి లో కోర్టు కానిస్టేబుల్ ప్రభు చరణ్ ఉన్నారు.
