..మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ బాసరగడి గ్రామంలో గోనె సంచిలోఓ మైనర్ బాలిక మృతదేహం లభ్యం అయింది మూడు రోజుల క్రితం అదృశ్యం అయిన చిన్నారి చివరికి శవం అయి తేలింది.
అదిలాబాద్ జిల్లా చెందిన ప్రభాకర్ బతుకు దెరువు కోసం కోసం 7 నెలల క్రితమే హైదారాబాద్ వచ్చారు సూరారంలో నివాసం ఉంటున్నాడు.
ఈ నెల 12న తన ఏడేళ్ల కూతురు జోష్న కనిపించడం లేదని ఆయన సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు . పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయినప్పటికి జోస్నా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.
ఈ నేపథ్యంలోనే బాసరగడి గ్రామంలో ఓ గోనెసంచిలో బాలిక మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం జోష్న దిగా గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడేళ్ల చిన్నారి ని ఎవరు హత్య చేసారు ? ఎందుకు చేశారనే కోణం లో దర్యాప్తు చేస్తున్నారు
