హత్యకు గురైన కానిస్టేబుల్ అంతక్రియలు శనివారం జరిగాయి.ఉదయమే జిల్లా ఆసుపత్రిలో శవ పంచనామా పూర్తీ చేసిన తర్వాత మృతదేహం ను కంఠేశ్వర్ లోని ఆయన ఇంటి కి తరలించారు .
అక్కడి నుంచి అశ్రునయనాల మధ్య అంతిమ యాత్ర మొదలయ్యింది.సీపీ సాయి చైతన్య పడే మోశారు. ఐజి చంద్ర శేఖర్ రెడ్డి అంతక్రియల్లో పాల్గొన్నారు. మృతుడి బ్యాచ్ మెంట్ లు ఆయా స్టేషన్ లలో కలిసి పనిచేసిన కానిస్టేబుళ్లు భారీ సంఖ్య లో తరలి వచ్చారు. చాల మంది సహచరులు ప్రమోద్ మృతదేహం చూసి కన్నీళ్ల పర్యంతం అయ్యారు.
