వడ్డి వ్యాపారుల వేధింపులు తాళలేక వారి మాటలకు మనస్థాపం గురైన ఓ కుటుంబం బుధవారం బాసర గోదావరి నది లోకి దూకి ఆత్మ హత్యకు సిద్ధం అయింది. తండ్రి కూతరు గల్లంతు కాగ తల్లి మాత్రం జాలర్లు కాపాడి ఒడ్డుకు చేర్చారు. నిజామాబాద్ నగరంలోని న్యాల్ కాల్ రోడ్డు లో నివాసం ఉండే వేణు అనురాధ లు వడ్డి వ్యాపారులైన రోషన్ వికాస్ ల వద్ద ముడులక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నారు. వడ్డి తో సహా అసలు చెల్లించినప్పటికి చక్ర వడ్డి కూడా ఇవ్వాలని వేధించారని ఇంటికి తమ మనుషులను పంపి తన కూతరు పూర్ణ తో పాటు తన పట్ల అనుచితంగా మాట్లాడారని బాధితురాలు అనురాధ వాపోయింది
