నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు జిల్లాలో ఆయా మున్సిపాలిటీ ల్లో కొత్త పాలక మండళ్లు సోమవారం కొలువు దీరాయి. ఫలితాలు వచ్చాక క్యాంపు లకు వెళ్లిన అభ్యర్థులు నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు వచ్చారు.
నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ కార్పొరేషన్ లో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో ఎం.పీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు . దీనిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పక్కాగా ఏర్పాట్లచేసారు .
నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలలో స్పెషల్ మీటింగ్ లు మొదలు అయ్యాయి . ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు జరుగకుండా ఆయా మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు .
ఉదయం 11.00 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభం కాగానే , నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం 12.30 గంటలతర్వాత మేయర్/డిప్యూటీ మేయర్, ఛైర్మన్/వైస్ చైర్మన్ల ఎన్నిక జరగ నుంది త. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా మేయర్/డిప్యూటీ మేయర్, ఛైర్మన్/వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది
