వేములవాడ దైవదర్శనం కోసం వెళ్తున్న తుఫాన్ వాహనం చెట్టును ఢీకొట్టిన ఘటన లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి-సిరిసిల్ల లమధ్య రహదారిపై మంగళవారం ఉదయం జరిగింది .
వేములవాడ వైపు తుఫాన్ వాహనం వెళ్తుండగా.. మాచారెడ్డి మండలం ఘనపూర్ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, గాయపడిన వారంతా మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు చెప్తున్నారు