ప్రేమించిన యువతి నిరాకరించిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందల్వాయి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…
మండలంలోని సిర్నపల్లికి చెందిన అజయ్ (21) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసుకున్నాడు ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఓ యువతిని ప్రేమించాడు.
దాంతో యువతి ప్రమకు నిరాకరించిందని తీవ్ర మస్థాపానికి గురై ఈనెల 10 పురుగుల మందు సేవించి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలపకుండ ఫుడ్ పాయిజన్ అవుతుందని తెలిపి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.
అయినా ఆరోగ్యం నిలకడ లేదని నిజామాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి క్రమంలో యువకుడి ఫోన్ చూడగా పురుగుల మందు సేవింస్తూ తీసిన వీడియో లభ్యం కావడం తో హుటాహుటిన నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు.
చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కుటుంబ సభ్యుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు.
