మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు.నగరంలోని రాజీవ్ ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ మకరంద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
నగరంలోని మున్సిపల్ కార్మికులందరూ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ క్యాంప్ లో అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉన్నాయని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్,నటరాజ్,ప్రశాంత్,సునీల్,మహేష్,మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.





