భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో దొంగలు ఎవరూ లేరు ఇంటిని టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. బుధవారం మధ్యరాత్రి సమయంలో బడా భీమ్గల్ గ్రామానికి చెందిన చిత్తరి ప్రభాకర్ ,ముఖేష్ ఇండ్లలో చోరికి పాల్పడ్డారు.
ఇద్దరు అన్నదమ్ములు ఇంటికి తాళం వేసి వేరే గ్రామానికి వెళ్లగా ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో కి చొరబడి బీరువాలో వున్న సుమారుగా మూడున్నర తులాల బంగారం ఆభరణాలు మరియు కొంత నగదును దొంగలించినారని చిత్తారిలక్ష్మీ దరఖాస్తు ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
