గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. రెంజల్ మండలం కందుకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది వంతెన మీదుగా ప్రవహిస్తుంది.దీనితో అధికారులు అప్రమత్తం అయ్యారు. రెండు వైపుల బ్యారీ కేడు లు ఏర్పాటు చేసారు.
మహారాష్ట్ర వైపు రాకపోకలను నిలిచి పోయాయి. మహారాష్ట్ర లో భారీ వర్షాలు పడుతుండడంతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తడం తో అక్కడి నుంచి వచ్చే వరద నీరు కూడా ఇక్కడే కలుస్తుండడం వల్ల గోదావరికి వరద ఉదృతి అనూహ్యంగా పెరిగింది.
మంగళవారం సాయంత్రానికి వరద ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు
