డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఇద్దరికీ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ విధించినట్లు ట్రాఫిక్ సిఐ పి. ప్రసాద్ తెలిపారు.వివరాల్లోకి వెళ్లితే..
నగరంలోని వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ దిడి రాజు ను శుక్రవారం కోర్టు ముందు హాజరు పరచగా రెండు రోజుల జైలు, అలాగే హుస్సేన్ బిన్ సలీం కు మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
అలాగే మరో 9 మందికి రూ.25,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు.వాహన చోదకులు మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు.
