HomeCRIMEహయత్ నగర్ స్టేషన్ మీద బాధితుల దాడి

హయత్ నగర్ స్టేషన్ మీద బాధితుల దాడి

హత్య కేసును ఆత్మ హత్య కేసు గా మార్చేస్తున్నారని ఆరోపణలతో మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి మరి పోలీసులపై దాడికి తెగ బడిన ఉదంతం హయత్ నగర్ స్టేషన్ లో జరిగింది. ఈ దాడిలో పోలీసులకు గాయాలు అయ్యాయి.

స్టేషన్ లోనే ఉన్న అనుమానితుడిని సైతం తీవ్రంగా కొట్టారు హయత్‌నగర్‌ బంజారా కాలనీలో గత రాత్రి ఓ వివాహిత అనునాస్పదంగా మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ వ్యక్తి ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు .

ఆ హత్యను ఆత్మహత్యగా చూపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు .

పీఎస్‌ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సహనం కోల్పోయి ఆవేశంతో పీఎస్‌లోకి దూసుకెళ్లి పోలీసులపై దాడికి దిగారు.ఈ ఘటన ఫై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments