ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయము, చంద్రశేఖర కాలనీ, నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు పుస్తక ప్రదర్శన జరుగుతోంది.
ఈ ప్రదర్శనలో వివిధ రకాల పుస్తకాలు ప్రదర్శనలో ఉన్నాయి.పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని గ్రంథాలయాధికారి శ్రీ పి.బుగ్గారెడ్డి గారు సూచించారు. పుస్తక ప్రదర్శనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు పాల్గొన్నారు.
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన, కవి సమ్మేళనం, రచయితల పరిచయం, చిత్రలేఖనం, వ్యాసరచన, పోటీలు నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో సహాయ గ్రంథపాలకులు పట్టేం.మధు పాఠకులు పాల్గొన్నారు.
