గంజాయి విక్రయిస్తున్న యువకుడినీ పట్టుకొని అరెస్టు చేసినట్లు మాక్లూర్ పోలిసులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్లితే..నగర శివారులోని దాస్ నగర్ వద్ద వాహనాల తనిఖీల చేస్తున్నాడా నవిపేట్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన మెట్టు మల్ల శ్రీకాంత్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకొని విచారించగా అతని వద్ద 110గ్రాముల లభించింది.
దీంతో అతని విచారించగా అధిక లాభం కోసం గత కొన్ని రోజులుగా నాందేడ్ నుంచి తీసుకోవచ్చి చుట్టూ పక్కల గ్రామాల యువకులకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నాడు.దీంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
