నిజామాబాద్ నగరంలో పోలీస్ ఎన్ కౌంటర్ లలో దొంగలు హతం అయినా ఉదంతాల్లో రియాజ్ ది మూడోది. గతంలో ఆనంద్ ఎస్పీ గా పనిచేస్తున్న కాలం లో నగరం దోపిడీ హత్యలు దొంగతనాలతో అట్టుడికి పోయింది.
దీనితో ఖానాపూర్ శివారు లో పెట్రోలింగ్ లో ఉన్న మూడో టౌన్ ఎస్సై ఆనంద్ వాహనం మీద దాడికి తెగబడిన దొంగల ముఠా మీద కాల్పులు జరపడం తో గుర్తు తెలియని దొంగ హతం అయ్యాడు. మూడు రోజులకు మాదవనగర్ శివారు లో హైదారాబాద్ మెయిన్ రోడ్డు కు వంద మీటర్ల దూరం లో వ్యవసాయ క్షేత్రంలో దొంగల ముఠా మీద జరిగిన కాల్పుల్లో ఓ దొంగ హతం అయ్యాడు.
దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత ఘరానా దొంగ పోలీస్ కాల్పుల్లో హతం అయ్యాడు. ఈసారి ఎన్ కౌంటర్ లో హతం అయిన రియాజ్ ఏకంగా నడి రోడ్డులో కానిస్టేబుల్ ను హత్య చేసి పారిపోయాడు.
