నగరంలో తాళం వేసిన ఇంట్లో చోరి జరిగిన సంఘటన మూడవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…నగరంలోని మహారాష్ట్రకు కు చెందిన దత్తద్రి అతని కుటుంబ సభ్యులతో కలిసి నాందేవాడ లో కిరాయికి ఉంటున్నారు. ఈ నెల 1 న పండగ సందర్భంగా మహారాష్ట్ర కు వెళ్ళారు.
ఈ మేరకు ఇంటి యజమాని శివాజీ బోస్లే ఈక్రమంలో ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో నుంచి 3 తులాల బంగారం,కొంత అపహారించినట్లు తెలిపారు. ఇంటి యజమాని ఫిర్యాధు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.
