నిజామాబాద్ నగరంలోని మెడికల్ షాపులో భారీ చోరీ జరిగింది. సోమవారం రాత్రి ముగ్గురు దుండగులు రెండు ద్విచక్ర వాహనంపై వచ్చి వరెణ్య మెడికల్ షాప్ లో చొరబడి నుంచి రూ.5 లక్షల నగదు అపహారించినట్లు తెలిపారు.
షాపు యజమాని సింగారం గంగాధర్ సమాచారం మేరకు స్థానిక ఒకటవ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
