అప్పుల బాధతో యువకుడు ఆత్మ హత్యా చేసుక్కున ఘటన ఇందల్వాయి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం.
ఇందల్వాయి మండలం లోని త్రియంబకపేట్ గ్రామానికి చెందిన బైరీ గణేష్(22) అనే యువకుడు గత ఏడాది క్రితం బతుకుదేరుకు కొరకు సౌదీ వెళ్ళాడు.అక్కడ 6నెలలు గడిపి సరైన ఉపాధి అవకాశాలు దొరకక తిరిగి ఇంటికి వచ్చాడు.
ఆ తరువాత మళ్ళీ హైదరబాద్ కూడా వెళ్ళాడు. అక్కడ కూడా ఉపాధి దొరకకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.వెళ్ళిన ప్రతి చోటు నష్టం అవ్వడంతో అప్పులు కుప్పలుగా అయ్యాయి.
దాంతో యువకుడు మంగళవారం తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మ హత్య చుకున్నట్లు పోలీస్ లు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
కుటుంబం సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇందల్వాయి ఎస్ఐ మనోజ్ తెలిపారు.
