తమును నమ్మించి మోసం చేసిన రైతులు కవిత ను ఎలా బండకేసి కొట్టారో అర్వింద్ కు సైతం అదే గుణపాఠం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పిలునిచ్చారు. ఆయన బుధవారం రాత్రి నెహ్రు పార్క్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభ లో ఆయన మాట్లాడారు.
2014 ఎన్నికల్లో కెసిఆర్ బిడ్డ కవిత పోటీచేసిన కవిత చెరుకు ఫ్యాక్టరీ వంద రోజుల్లో తెరిపిస్తామని మాట ఇచ్చిందని అదే నమ్మిన రైతులు ఆమె గెలిపిస్తే హామీ గాలికి వదిలేస్తే 2019 ఎన్నికలో రైతులు వంద మంది కవిత ను ఓడించడానికి ముందుకొచ్చి నామినేషన్ లు వేశారని. ఓడించి గుణపాఠం చెప్పారన్నారు.
గెలిస్తే పసుపు బోర్డు అయిదు రోజుల్లో తెస్తానని రైతులకు అర్వింద్ మాట ఇచ్చారు.
రాజనాథ్ సింగ్ రాం మాధవ్ లతోనూ చెప్పించారని అందుకే బోర్డు వస్తోందని నమ్మి గెలిపిస్తే ఐదేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు మోడీ వచ్చి బోర్డు ఇస్తానని నమ్మిస్తున్నారని అందుకే పసుపు రైతుల నమ్మకాన్ని వమ్ము చేసిన అర్వింద్ కు కూడా గుణపాఠం చెప్పాలని కోరారు .