నిజామాబాద్ నగరంలోని పాస్ పోర్టు సేవ కేంద్రం ను ఎంపీ అర్వింద్ మంగళవారం సందర్శించారు అధికారులు, సిబ్బంది, ఆయన స్వాగతం పలికారు. దరఖాస్తుదారులతో ఆయన అక్కడి సేవల ఫై మాట్లాడారు .
హైదరాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజా జొన్నలగడ్డతో కూడా అన్ లైన్ ద్వారా సంభాషించారు . పాస్పోర్ట్ సేవా కేంద్రాలు సేవలను వేగవంతం చేసి, సులభతరం చేశాయి.
సాధారణ దరఖాస్తుదారులకు వారం రోజుల్లో, తత్కాల్ దరఖాస్తుదారులకు మూడు రోజుల్లో పాస్పోర్ట్లు అందుతున్నాయని . ఈ సమర్థవంతమైన సేవల కోసం అధికారులు, సిబ్బందిని అభినందించారు.
