సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో మంగళవారం దారుణ హత్య జరిగింది. నడి రోడ్డు మీద ఈ ఘాతుకం జరిగింది. గంజాయి గ్యాంగ్ లో మధ్య వైరమే ఈ హత్య కు కారణంగా చెప్తున్నారు .
హమేర్(35) అనే వ్యక్తిపై స్థానిక యువకుడు కొబ్బరికాయలు కొట్టే కత్తితో నడిరోడ్డుపైనే అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి,చేసారు . తీవ్రంగా గాయపడిన హమేర్ను స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిసింది.
మృతుడు హమేర్పై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం నిందితుడు పరారవగా, అతని కోసం సైదాబాద్ పోలీసులు గాలిస్తున్నారు .
హమీర్ పై పలు చోరీ కేసుల్లో ఉన్నాయి. పాతకక్షలు , ఆర్థిక లావాదేవీలు కారణంగానే దాడి చేసినట్లు తెలుస్తోంది.ప్రకారం.. మృతుడు మరియు నిందితుడు ఇద్దరూ గంజాయి ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది
