రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆర్టీఏ కార్యాలయం నాగరం నుంచి వర్ని X వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించారు.
ప్రయాణీకులను ఓవర్లోడ్ చేయడంపై అవగాహన నిషేధించబడింది, ఆటోలో వస్తువులను లోడ్ చేయడం కూడా నిషేధించబడిందనీ తెలిపారు. ఆటో డ్రైవర్లు మరియు ఇతర రహదారి వినియోగదారులకు ఇతర సూచనలు కూడా ఇవ్వబడ్డాయి.
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్.. మాట్లాడుతూ.. మైనర్లు బైకులు డ్రైవ్ చేయొద్దని చెప్పి హెల్మెట్ లేకుండా లైసెన్సులు సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేయొద్దనీ హెచ్చరించారు. అదేవిధంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణం చేయమని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో డిటీఓ ఉమామహేశ్వర్ రావు, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, రాహుల్ కుమార్, 5వ టౌన్ SI గంగాధర్, లక్ష్మయ్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
