నిజామాబాద్ కేంద్రంలోని ఓ ఇంటి ముందు నుంచి కారు చోరి జరిగింది.మూడవ టౌన్ ఎస్ఐ హరి బాబూ తెలిపిన వివరాల ప్రకారం గౌతమ్ నగర్ కి చెందిన
ఏనుగందుల పవన్ కుమార్ అనే వ్యక్తి ఈ నెల 9 వ తేదీన రాత్రి హైదరాబాద్ కి వెళ్తు తన యొక్క i10 కార్ నెంబర్ TS16FH5777 ని తన ఇంటి ముందు పార్క్ చేసి వెళ్ళాడు. మరుసరటి రోజు ఇంటికి వచ్చి చూడగా తాను పార్క్ చేసిన తన కార్ కనిపించలేదు.
చుట్టూ పక్కల వెతికిన కానీ దొరకనందున శనివారం నగరంలో స్థానిక మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరి బాబూ తెలిపారు.
