నిషేధిత గంజాయి పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ రాష్ట్ర డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి చేతుల మీదుగా 15వేల రూపాయల నగదు అందజేశారు. జిల్లా ఎక్సైజ్
అండ్ ప్రొహిబిషన్ సీఐ స్వప్న ఆధ్వర్యంలో ఇటీవల జిల్లాలోని గంజాయి స్థావరాలపై దాడులు నిర్వహిస్తూ 30.250 కిలోల గంజాయి పట్టుకున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి చేతుల మీదుగా సీఐ స్వప్నకు 5000/- రూపాయలు సిబ్బందికి 10,000/- రూపాయలు నగదు పురస్కారాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అడిషనల్ కమిషనర్ ఖురేషి, జిల్లా డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
